చట్ట సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, మార్చి 10: బీమా చట్టంలో సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో బీమా రంగంలోకి 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను అనుమతించేందుకు లైన్ క్లియరైంది. ప్రస్తుతం జీవిత, జనరల్ బీమా సంస్థల్లో ఎఫ్డీఐ పరిమితి 49 శాతంగానే ఉన్నది. ఈ నేపథ్యంలో దీన్ని మరో 25 శాతం పెంచేందుకు బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లో మార్పులను అంగీకరించింది. 2015లో బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచిన సంగతి విదితమే.