న్యూఢిల్లీ, ఆగస్టు 4: సుప్రీం కోర్టులో మొత్తం 71 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇందులో పదేండ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు 10 వేలు అని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
మొత్తం 71,411 కేసుల్లో సివిల్ కేసులు 56 వేలు, క్రిమినల్ కేసులు 15 వేలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఐదేండ్ల పాటు పెండింగ్లోనే ఉన్నవి 42 వేలు కాగా, 5-10 ఏండ్లుగా పెండింగ్లో ఉన్నవి 18,134 కేసులు అని వివరించారు.