కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ సిటీలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. నాటు బాంబు పేలడంతో ఏడేండ్ల బాలుడు మృతి చెందాడు. బుర్ద్వాన్ ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. షేక్ ఇబ్రహీం(9), షేక్ అఫ్రోజ్(7) కలిసి తమ ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో తమ ఇంటికి సమీపంలో దొరికిన ఓ ప్యాకెట్ను నేలకేసి కొట్టారు. దాంట్లో ఉన్న నాటు బాంబు పేలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు బాలురను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అఫ్రోజ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.