హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 696 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. వైరస్ నుంచి 858 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,32,379కు చేరింది. ఇందులో 6,18,496 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం 3,735 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10,148 ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకే రోజు 1,05,797 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 82, జీహెచ్ఎంలో 68, నల్గొండలో 49, వరంగల్ అర్బన్లో 48, పెద్దపల్లిలో 48, కరీంనగర్లో 45 కేసులు రికార్డయ్యాయని వివరించింది.