నిజామాబాద్ : మెండోరా మండలం పోచంపాడు వద్ద విషాదం నెలకొంది. పోచంపాడు ప్రాజెక్టు దిగువన.. గోదావరిలో పుణ్యస్నానాల కోసం వచ్చిన ఏడుగురు వ్యక్తులు నదిలో గల్లంతు అయ్యారు. వీరిలో ఒకరు సురక్షితంగా బయటపడగా, మిగతా వారు గల్లంతు అయినట్లు పోలీసులు తెలిపారు. గల్లంతు అయిన వారిలో ఇద్దరి మృతదేహాలను జాలర్ల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. మిగతా వారి కోసం నదిలో గాలిస్తున్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. బాధితుల స్వస్థలం ఎల్లమ్మగుట్ట, డీకంపల్లి, గుత్పా.
సురక్షితంగా బయటపడిన వ్యక్తిని దర్పల్లి రవికాంత్(15)గా గుర్తించారు. గల్లంతైన వారిని జిలకర్ర సురేశ్(40), జిలకర్ర యోగేష్(16), బొబ్బిలి శ్రీనివాస్ (40), బొబ్బిలి సిద్ధార్థ్(16), బొబ్బిలి శ్రీకర్(14), దొడ్లె రాజు(24)గా గుర్తించారు.