న్యూఢిల్లీ: 5జీ టెలికాం సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్ధంలో భారత్కు ఇది చరిత్రాత్మక దినమన్నారు. టెలికాం రంగంలో 5జీ సేవలు విప్లవాత్మక మార్పులు తేనున్నట్లు తెలిపారు. 5జీని ఆవిష్కరించడం అంటే.. 130 కోట్ల మంది భారతీయులకు ఇది టెలికం రంగం ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు. ఈ దేశంలో కొత్త శకానికి ఇదో ముందడుగు అన్నారు. అపరిమిత అవకాశాలకు కూడా ఇది ఆరంభమే అని ప్రధాని తెలిపారు. 5జీ టెక్నాలజీ విషయంలో నవభారత్ కేవలం ఓ వినియోగదారుడిగా ఉండిపోదు అని, ఆ టెక్నాలజీ అభివృద్ధి విషయంలోనూ యాక్టివ్ పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిలో ఇండియా ఇక దూసుకువెళ్తుందని ప్రధాని తెలిపారు.