అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 25,284 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,879 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.9 మంది కరోనాతో మరణించారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 11,384 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 856, తూర్పుగోదావరి జిల్లాలో 823, కడప జిల్లాలో 776, కృష్ణ జిల్లాలో 650 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.