కాబూల్ : ఆప్ఘనిస్థాన్లోని కాబూల్ని షాహిద్ మజారీ రోడ్లోని పుల్-ఎ-సుఖ్తా ప్రాంతానికి సమీపంలో ఆత్మాహుతి సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో 53 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఓ పాఠశాల తరగతి గదికి సమీపంలో పేలుడు జరగ్గా.. పేలుడులో 53 మంది మృతి చెందారు. ఇందులో 46 మంది బాలికలు, మహిళలు ఉన్నారు. కాబూల్లోని పీడీ-6 ప్రాంతంలోని పశ్చిమాన మధ్యాహ్నం 2 గంటలకు ఈ పేలుడు సంభవించింది.
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 30న శుక్రవారం కాబూల్లోని యూనివర్సిటీ వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో కనీసం వంద మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. షియా ప్రాంతంలోని విద్యాసంస్థపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లోని మైనారిటీ షియా కమ్యూనిటీ వ్యక్తులు ఎక్కువగా నివసించే కాబూల్లోని దష్టి బార్చి పరిసరాల్లోని సెంటర్ లోపల ఉదయం సమయంలో పేలుడు చోటుచేసుకున్నది.