హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లోని సనత్నగర్లో వ్యభిచార ముఠా గట్టు రట్టయింది. సనత్నగర్లో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు బంగ్లాదేశ్కు చెందిన ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.