హరిద్వార్/డేరాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లోని రూర్కీ ప్రైవేటు హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా ఐదుగురు కోవిడ్ పేషంట్లు మరణించారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 1.30 నుంచి 2 గంటల మధ్యలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు వైద్యులు తెలిపారు. అరగంట అంతరాయంతో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు వెంటిలేటర్పై, నలుగురు ఆక్సిజన్పై ఉన్నారని అంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తున్నామని హరిద్వార్ జిల్లా మేజిస్ట్ర్రేటు సీ రవిశంకర్ తెలిపారు.