జైపూర్ : రాజస్థాన్లో విషాదకర ఘటన జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ధాన్యం నిల్వ చేసే కంటైనర్లో పడి ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బికనీర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిచెందిన చిన్నారులంతా 3 నుంచి 8 ఏండ్ల మధ్య వారే.
‘కంటైనర్ దాదాపు ఖాళీగా ఉందని.. పిల్లలు ఆడుకుంటూ ఒకదాని పైనుంచి మరోదానిపైకి దూసుతున్న క్రమంలో కంటైనర్లో పడి ప్రమాదవశాత్తు మూసుకుపోవడంతో ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిలో నలుగురు బాలికలు, ఓ బాలుడున్నారు. పిల్లలు ఇంట్లో లేకపోవడంతో తల్లి వెతుకుతూ కంటైనర్ను తెరవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.