హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్లోని వార్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్లకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిపోయింది. దీంతో అదుపుతప్పిన బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బస్సు ఏపీలోని జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.