Banking Service Charges Hit | బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో ఆదివారం (ఆగస్టు ఒకటో తేదీ) నుంచి భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
బ్యాంకుల ఖాతాదారుల రోజువారీ లావాదేవీలపై చార్జీలు పెరుగుతాయి. వివిధ లావాదేవీలపై చార్జీలను పెంచడానికి ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది.
ఇక సెలవు రోజుల్లోనూ నాక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వేతన చెల్లింపులు, నెలవారీ వాయిదాల చెల్లింపులు, ఏటీఎం చార్జీల్లో మార్పులు రానున్నాయి. అవేంటో ఒకసారి చూద్దామా..
ఇక ప్రతి రోజూ వివిధ బ్యాంకుల్లో నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాక్-NACH) సేవలు అందుబాటులోకి వస్తాయి.
బ్యాంకుల్లో జరిగే భారీ మొత్తం చెల్లింపులకు నాక్ వినియోగిస్తారు. నాక్ సాయంతో వేతనాలు/ పెన్షన్లు, డివిడెండ్లు, వడ్డీ తదితర చెల్లింపులు జరుపుతారు.
ఇంకాఎలక్ట్రిసిటీ, గ్యాస్, టెలిఫోన్, వాటర్, నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ), మ్యూచువల్ ఫండ్స్, బీమా ప్రీమియం చెల్లింపులూ నాక్ ద్వారానే జరుగుతాయి.
సెలవు రోజుల్లో కూడా ఆటోమేటిక్గా..
వివిధ రుణాల నెలసరి వాయిదా (ఈఎంఐ) చెల్లింపులు సెలవు రోజుల్లో బ్యాంకుల నుంచి డెబిట్ కావు. కానీ ఆదివారం నుంచి ఈఎంఐలతో పాటు యుటిలిటీ సేవల బిల్లులు కూడా సెలవు రోజుల్లో ఆటోమేటిక్గా జరుగుతాయి.
నాక్ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డెవలప్ చేసింది. ఈ సేవలు ఇప్పటి వరకు బ్యాంకు పని దినాల్లో మాత్రమే లభ్యం అవుతాయి.
ఆగస్టు ఒకటో తేదీ నుంచి బల్క్ పేమెంట్స్ సిస్టం అన్ని రోజుల్లోనూ ఖాతాదారులకు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ గత నెలలో ప్రకటించింది. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డీబీటీ) మోడ్లో నిధులను నాక్ ద్వారా పంపిణీ చేస్తున్నది కేంద్రం.
వివిధ బ్యాంకులు, ఏటీఎం లావాదేవీలు, నగదు చెల్లింపులు పెరుగనున్నాయి. ఏటీఎం డిప్లాయిమెంట్, ఏటీఎం నిర్వహణ ఖర్చుల భారం కూడా కస్టమర్లపై మోపేందుకు ఆర్బీఐ అనుమతించింది.
అందుకే ఇతర బ్యాంకు ఏటీఎం కేంద్రాల వద్ద నగదు విత్ డ్రాయల్స్పై ఇంటర్ చేంజ్ ఫీజు పెంచుకునేందుకు బ్యాంకులకు జూన్లోనే ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
ఇలా ఇంటర్ ఛేంజ్ చార్జీలు
ఇతర బ్యాంకు ఏటీఎంల్లో ఆర్థిక లావాదేవీలపై ఇంటర్ చేంజ్ చార్జీ రూ.15 నుంచి రూ.17 వరకు పెరుగనున్నది. ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెంచారు. 2014 తర్వాత తొలిసారి ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద విత్ డ్రాయల్స్పై ఇంటర్ చేంజ్ చార్జీలు పెంచుతున్నాయి బ్యాంకులు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) కూడా తన ఖాతాదారులకు అందించే సేవలను సవరించింది.
ఐపీపీబీ అందించే డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి చార్జీ వసూలు చేస్తుంది. ఈ సేవలు ఇప్పటి వరకు ఉచితం.
ఆదివారం నుంచి ప్రతి రిక్వెస్ట్పై రూ.20తోపాటు జీఎస్టీ చెల్లించాలి. డోర్ స్టెప్ సేవలను వినియోగించుకోవాలని కోరుకునే వారికి మాత్రమే ఈ చార్జీలు వర్తిస్తాయి.
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా ఆదివారం నుంచి తన ఖాతాదారులపై చార్జీలు వడ్డించనున్నది. నగదు లావాదేవీలపై పరిమితులు సవరించింది.
డొమెస్టిక్ సేవింగ్స్ ఖాతాదారులు ఏటీఎం ఇంటర్ చేంజ్, చెక్బుక్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక నగదు డిపాజిట్లు-విత్ డ్రాయల్స్ మీద చార్జీలు విధించింది. రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులు నాలుగు నగదు లావాదేవీల సేవలు ఉచితం. అది దాటితే రూ.150 మేరకు ఖాతాదారులు చెల్లించాల్సిందే.
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధర ప్రతి నెల ఒకటో తేదీ సవరిస్తారు. దీని ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి వంట గ్యాస్ సిలిండర్ల ధర పెరుగుతుంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరకు అనుగుణంగా ఈ ధరలు ఖరారవుతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
ICICI Bank alert | ఆగస్టు నుంచి ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల మోత..!