అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 256 మంది చికిత్సకు కోలుకున్నారు. విశాఖపట్నంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 8,94,536కు చేరింది. 8,84,727 మంది కోలుకోగా..మరో 2,616 యాక్టివ్ కేసులున్నాయి. 7193 మంది మృత్యువాతపడ్డారు.
గడిచిన 24 గంటల్లో 33,634 శ్యాంపిళ్లను పరీక్షించారు. నేటివరకు 1,48,05,535 శాంపిళ్లను పరీక్షించారు.