సూర్యాపేట : జిల్లా కేంద్రంలో 47వ జాతీయస్థాయి బాలబాలికల సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్-2021 కబడ్డీ పోటీలు రెండోరోజు హోరాహోరీగా కొనసాగాయి.
ఉత్తరప్రదేశ్ – తెలంగాణ బాలుర జట్ల మధ్య పోటీని మంత్రి జగదీశ్ రెడ్డి టాస్వేసి ప్రారంభించారు. ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని అభినందించారు.
పలు జట్ల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీలు రసవత్తరంగా జరిగాయి. సోమవారం నుంచి కబడ్డీ పోటీలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
క్రీడా పోటీలను తిలకించేందుకు రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కేఈ ప్రభాకర్, సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు గుంటకండ్ల రామచంద్రా రెడ్డి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.