హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 449 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా 623 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో ఇద్దరు వైరస్ ప్రభావంతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,406 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలో 79,231 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది.