ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. నాలుగేండ్ల చిన్నారిపై ఆమె సవతి తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ముజఫర్నగర్ జిల్లాకు చెందిన ఒక మహిళ మొదటి భర్త వదిలేయడంతో రెండేండ్ల క్రితం మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే అప్పటికే ఆమెకు రెండేండ్ల కూతురు ఉన్నది. ఇటీవల ఆమె రెండో భర్త చిన్నారిని పంట చేలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న ఆమె బంధవు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు.