న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సాయం చేయాలని కోరిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్తోపాటు నాలుగు రాష్ట్రాలు రూ.16,467 కోట్ల మేరకు సాయం చేయాలని కోరాయని సోమవారం లోక్సభలో వెల్లడించారు.
పోర్చుగీసు వలస పాలన ముగిసి అరవయ్యేండ్లు పూర్తయిన ప్రత్యేక ఉత్సవాల కోసం గోవా రూ.500 కోట్లు అడిగినట్లు ఠాకూర్ తెలిపారు. వివిధ రంగాల్లో అభివృద్ధి పనుల కోసం మణిపూర్ రూ.14,567 కోట్లు, నాగాలాండ్ రూ.700 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కోసం విజ్ఞప్తులు పంపాయన్నారు. నిబంధనల ప్రకారం ఆయా రాష్ట్రాల ప్రతిపాదనలు పరిశీలించి ఆర్థిక వనరుల లభ్యత మేరకు ప్రత్యేక గ్రాంట్ల కింద సాయం అందిస్తామని మంత్రి తెలిపారు.