సిద్దిపేట: హుస్నాబాద్లో పెను ప్రమాదం తప్పింది. భారీ క్రేన్ను ఢీకొట్టిన ఆర్టీసీ మినీ బస్సు (RTC Mini bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఆర్టీసీ మినీ బస్సు హుస్నాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో బస్టాండ్ వద్ద భారీ క్రేన్ను బస్సు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్తోపాటు మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.