చిత్రకూట్ : కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా ఖోపా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం మద్యం సేవించారు. కాసేపటికి వీరిలో ఓ వ్యక్తి తీవ్ర అవస్థతకు గురై మృతి చెందాడు. మరొకరు చికిత్స పొందుతూ ప్రైవేట్ దవాఖానలో మృతిచెందాడు.
పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని చికిత్స నిమిత్తం అలహాబాద్కు తరలించారు. వీరిలో మరో ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య నలుగురికి చేరిందని ఐజీ సత్యనారాయణ తెలిపారు. గ్రామంలో మద్యం దుకాణం లేదని, దాదాపు 15 కిలోమీటర్ల దూరం నుంచి వీరు మద్యం తెచ్చుకున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.
మద్యం విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదేవిషయంలో ఓ సబ్ ఇన్స్పెక్టర్తోపాటు కానిస్టేబుల్ను విధుల నుంచి ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రాజ్పూర్ ఎస్హెచ్ఓపై శాఖపరమైన చర్యలకు ఆదేశించారు.