కోల్కతా : ఉత్తర బెంగాల్లో సిక్కీం, నేపాల్ సరిహద్దులో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. గడిచిన 12 గంటల్లో రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 7.07 గంటల ప్రాంతంలో ఉత్తర బెంగాల్ పరిధిలోని జల్పాయిగురి, అలీపుర్దువార్, డార్జిలింగ్ అంతటా భూమి కంపించింది. అలాగే సిక్కీంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది. భూకంప కేంద్రం సిలిగురికి 64 కిలో మీటర్ల దూరంలో భూపంక కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపంతో నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది. అయితే, ప్రకంపనల ధాటికి జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇంతకు ముందు సోమవారం రాత్రి సిక్కీంలో 5.4 తీవ్రతతో భూమి కంపించింది.