దిగ్లీపూర్: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవరాం తెల్లవారుజామున 4.56 గంటలకు అండమాన్ దీవుల్లోని దిగ్లీపూర్లో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దిగ్లీపూర్కు 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 80 కిలోమీటర్ల లోతులో భూమిలో కదలికలు వచ్చాయని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా అందలేదని అధికారులు తెలిపారు.