హైదరాబాద్: శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు మరోసారి వరద పోటెత్తింది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశానికి 3,50,341 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 2,51,847 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.8 అడుగుల వద్ద నీరు ఉన్నది. శ్రీశైలం గరిష్ట నీటినిల్వ 215.8 టీఎంసీలు కాగా, ఇప్పుడు 214.84 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. దీనిద్వారా 62,446 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.