హైదరాబాద్: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేటట్లు లేదు. తగ్గుముఖం పట్టినట్లే పట్టి విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 336 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఒకరు మృతిచెందినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5282 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. మంగళవారం 76481 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని తెలిసింది. కొవిడ్ వ్యాధి నుంచి 306 మంది బాధితులు కోలుకున్నట్లు వివరించారు.