హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 301 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,59,844కు చేరింది. కొత్తగా 339 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 6,50,453 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్తో మరో ఇద్దరు మృత్యువాతపడగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,866కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.57శాతంగా ఉందని, రాష్ట్రంలో 5,505 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. ఇవాళ ఒకే రోజు 67,720 కొవిడ్ టెస్టులు చేసినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ నుంచి 70, కరీంనగర్ నుంచి 31, హనుమకొండ నుంచి 22 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.