భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు ఆదివారం స్థానిక చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు. ట్రాలీ, ఆటో, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.