హైదరాబాద్: ఇంటర్ ప్రవేశాల గడువును మరోమారు పొడగించినట్లు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఓమర్ జలీల్ వెల్లడించారు. మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడగించామని తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ సహా అన్ని గురుకులాల్లో ప్రవేశాల గడువు బుధవారంతో ముగిసింది. తాజాగా ఈ నెల 30 వరకు పొడగించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రవేశాలు పొందని విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.