సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో క్రీడల ప్రోత్సాహానికి జీహెచ్ఎంసీ అవసరమైన చర్యలు చేపడుతున్నది. ఖర్చుకు వెనుకాడకుండా క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే నేపథ్యంలో క్రీడా మైదానాల ఆధునీకరణ, మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టి విడతల వారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. 854 క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణ, ఆధునీకరణ అవసరమైన చోట నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్లను అందుబాటులోకి తెచ్చేందుకుగాను రూ.86.61 కోట్ల అంచనా వ్యయంతో 18 క్రీడా మైదానాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ.40.16కోట్ల వ్యయంతో 8 చోట్ల క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆధునిక, సంప్రదాయ క్రీడల్లో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు కోచ్లను కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. వీరిని జిల్లా, రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించే స్థాయి వరకు జీహెచ్ఎంసీ తోడ్పాటు అందిస్తున్నది. ఈ క్రమంలోనే వచ్చే నెలాఖరులోగా మూడు చోట్ల క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు కొనసాగుతున్నాయని, ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్ జోన్ పరిధిలో రూ.11.99 కోట్లతో మూడు చోట్ల పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులో మరో మూడు చోట్ల పనులకు ఇటీవల పరిపాలన అనుమతులు లభించాయని, రూ.5.10కోట్లతో పనులకు టెండర్లను ఆహ్వానిస్తామని అధికారులు పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కాంప్లెక్స్ల వివరాలు