నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 20 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. సాగర్కు ప్రస్తుతం 3,35,786 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 3,29,394 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇప్పుడు 587.90 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 312.0405 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 306.0414 టీఎంసీలుగా కొనసాగుతుంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.