న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: గుజరాత్కు చెందిన ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. రూ.2,747 కోట్ల విలువైన కంపెనీకి చెందిన భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో కంపెనీ చైర్మన్ రిషి అగర్వాల్ను అరెస్ట్ చేసిన మరుసటి రోజే భారీ స్థాయిలో ఆస్తులను జప్తు చేయడం విశేషం.
గుజరాత్లోని సూరత్, దహేజా వద్ద కంపెనీకి ఉన్న వ్యవసాయ భూములు, ప్లాట్లు, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలోని పలు బ్యాంకుల్లో కంపెనీకి ఉన్న డిపాజిట్లను కూడా స్వాధీనం చేసుకున్నది. ఎస్బీఐ కన్సార్షియంగా 28 బ్యాంకులు కలిసి ఏబీజీకి రూ.2,468 కోట్ల రుణంగా ఇచ్చాయి.