అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 2,672 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో 18 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 2,467 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,37,122కు పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 18,98,966 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 13,115 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.