అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 2,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. మహమ్మారి బారినపడి మరో 15 మంది మృత్యువాతపడగా.. వైరస్ నుంచి తాజాగా 3,329 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,29,579కు చేరాయి. ఇందులో 18,90,565 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో వైరస్ బారినపడి ఇప్పటి వరకు 13,057 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. 24 గంటల్లో 90,204 నమూనాలను పరిశీలించగా, మొత్తం 2,32,20,912 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.