హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 301 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్తో ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,785కు పెరిగింది. ఇప్పటి వరకు 6,53,603 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,282 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.16 శాతానికి చేరగా.. మరణాల రేటు 0.58శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇవాళ ఒకే రోజు 58,261 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 72 కేసులు నమోదయ్యాయి.