స్వీకరించిన అదనపు కలెక్టర్లు
పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
కలెక్టరేట్, జూన్ 27: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 250 దరఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్ దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి 105, రెవెన్యూకు 82, పంచాయతీరాజ్శాఖకు 11, మున్సిపల్ శాఖకు 12, ఇతర శాఖలకు 40మంది దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, మత్స్యశాఖాధికారి దేవేందర్, జిల్లా సహకారాధికారి శ్రీమాల, పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, బీసీడీవో రాజమనోహర్రావు, ఎస్సీడీవో నతానియేలు, మైనార్టీ సంక్షేమాధికారి మధుసూదన్, డీఎంహెచ్వో జువేరియా, మెప్మా పీడీ రవీందర్, ఆత్మ పీడీ ప్రియదర్శిని, డీఎస్డీవో రాజవీరు, ఎల్బీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.
వైపరీత్యాలను ఎదురొనేందుకు సిద్ధం కావాలి
వానకాలంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలనైనా ఎదురొనేందుకు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానకాలంలో సంభవించే విపత్తులపై తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, వరదల కారణంగా ప్రాణహాని జరుగకుండా తక్షణ మే చర్యలు తీసుకోవాలని సూచించారు. హోర్డింగ్స్ పడిపోకుండా చూసుకోవాలని ఆదేశించారు. విద్యు త్ స్తంభాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆర్డీవో ఆనంద్కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతారెడ్డి, డీపీవో వీర బుచ్చయ్య, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి జువేరియా, ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, పశువైద్యాధికారి నరేందర్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, అగ్నిమాపక అధికారి వెం కన్న, సీపీవో కొమురయ్య, హార్టికల్చర్ డీడీ శ్రీనివా స్, జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది పాలొన్నారు.