హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 248 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,898కు పెరిగాయి. తాజాగా 324 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,65,285 మంది కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకు 3,912 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,701 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు రాష్ట్రంలో 52,702 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 66 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించారు.