హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. ఇందులో 2,98,009 మంది మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2101 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 716 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 1659 మంది మరణించారని వెల్లడించింది. నిన్న వైరస్ బారినపడిన వారిలో ముగ్గురు మరణించగా, మరో 158 మంది కోలుకున్నారని తెలిపింది.
కాగా, రాష్ట్రంలో కరోనా మృతుల శాతం 0.54గా ఉండగా, రికవరీ రేటు 98.75 శాతంగా ఉన్నదని వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో మంచిర్యాలలో 45, మేడ్చల్ మల్కాజిగిరిలో 41, కామారెడ్డి జిల్లాలో 35, జీహెచ్ఎంసీ పరిధిలో 29 చొప్పున కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 60,527 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం 93,59,772 నమూనాలను పరీక్షించామని పేర్కొంది.