హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 244 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,63,906కు పెరిగింది. కొత్తగా 296 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మొత్తం 6,55,061 మంది కోలుకున్నారు. వైరస్ మరొకరు మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,907కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,938 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ 50,505 మందికి టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.66శాతం, మరణాల రేటు 0.58శాతంగా ఉన్నది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 72 మంది, నల్గొండలో 19, కరీంనగర్లో 19, రంగారెడ్డిలో 18, ఖమ్మంలో 17 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు.