బెంగళూరు : దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందారు. తాజాగా 24 గంటల్లో కర్ణాటకలోని ప్రభుత్వ దవాఖానలో 24 మంది రోగులు మరణించారు. చామరాజనగర్ జిల్లా హాస్పిటల్లో రోగులు ఆక్సిజన్ కొరత, ఇతర కారణాలతో మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సురేష్కుమార్ తెలిపారు.
మరణాలపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటనపై సీఎం యెడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. అలాగే కలెక్టర్తో మాట్లాడారు. ఈ క్రమంలో మంగళవారం అత్యవసర కేబినెట్ సమాశానికి పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ఆదివారం 37,733 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇప్పటి వరకు 16లక్షల కేసులు రికార్డయ్యాయి. మరో 217 మంది చనిపోయాగా.. మొత్తం 16,011 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ తెలిపింది.