ఢాకా, సెప్టెంబర్ 25: బంగ్లాదేశ్లో బోటు మునిగి 24 మంది జలసమాధి అయ్యారు. ఆదివారం దాదాపు 80 మంది హిందూ భక్తులు పురాతన బోడేశ్వరి ఆలయానికి దర్శనానికి వెళ్తుండగా ఉత్తర పంచగఢ్లోని కొరోటా నదిలో పడవ మునిగి ఈ దారుణం చోటుచేసుకొన్నదని అక్కడి అధికారులు వెల్లడించారు.
మృతుల్లో 12 మంది మహిళలు, 8 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. మరికొంతమంది నదిలో కొట్టుకుపోయారని, వారికోసం గాలింపు చేపట్టామని వివరించారు. ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.