హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణ మొదలు కీ, ఫలితాల విడుదల వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వరుసగా విఫలమవుతున్నది. ఎన్టీఏ తీరుతో ఫలితాలపై ప్రభావం పడుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జేఈఈ మెయిన్ రెండో సెషన్ ఫైనల్ కీని 23 మార్పులతో ఎన్టీఏ ఆదివారం విడుదల చేసింది. ప్రాథమిక కీని విడుదల చేసిన ఎన్టీఏ.. విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 23 మార్పులు చేస్తూ తుది కీని ప్రకటించింది. రెండో సెషన్లో ఆరు ప్రశ్నల ఆన్సర్లు తప్పుగా ఉండటంతో సమాధానాలను ఉపసంహరించింది. పరీక్షలు నిర్వహించిన జూలై 25 నుంచి 30 వరకు అన్ని సెషన్లల్లోనూ తప్పులు చోటుచేసుకోవడం ఎన్టీఏ వైఫల్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. ప్రాథమిక కీని రూపొందించడంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్టీఏ చేసిన మార్పులివే..