అహ్మదాబాద్: శరన్నవ రాత్రుల సందర్భంగా ఒక యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తారాపూర్లోని ఆతీ శివశక్తి సొసైటీలో ఆదివారం సాయంత్రం గర్బా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ, యువకులు చుట్టూ తిరుగుతూ పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేయసాగారు. 21 ఏళ్ల వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్పుత్ కూడా ఇందులో పాల్గొన్నాడు. అందరితో కలిసి గర్బా డ్యాన్స్ చేశాడు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ముందుకు వచ్చి కుప్పకూలిపోయాడు. షాకైన తొటివారు ఎంత ప్రయత్నించినా అతడు కదలలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ యువకుడు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, గర్బా డ్యాన్ను మొబైల్లో రికార్డు చేసిన ఒకరు ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా షాకయ్యారు. మరోవైపు ఇటీవల కాలంలో డ్యాన్స్ లేదా వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
Anand :
गरबा खेलते खेलते एक शख्स की मौत।
तारापुर में आती शिवशक्ति सोसायटी में गरबा आयोजित किया गया था।
युवक को अस्पताल ले जाया गया लेकिन तब तक देरी हो चुकी थी।
वजह दिल का दौरा पड़ने से मौत बताई जा रही है। pic.twitter.com/GlUA1irveA
— Janak Dave (@dave_janak) October 2, 2022