భవనేశ్వర్ : ఒడిశా మయూర్భంజ్లోని ఉడాలా సబ్ జైలులో ఉన్న 21 మంది అండర్ ట్రయల్ ఖైదీలకు కరోనా సోకింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వారిని ఐసోలేషన్లో ఉంచినట్లు జైలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విద్యాధర్ దండపత్ పేర్కొన్నారు. అవసరమైన వారిని కొవిడ్ కేర్ సెంటర్కు తరలించి చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఒడిశాలో కరోనా పంజా విసురుతోంది. గతకొద్ది రోజులుగా భారీగానే కేసులు నమోదువుతున్నాయి. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,793 కరోనా కేసులు నమోదవగా.. 18 మంది మృతి చెందారు. మొత్తం కేసులు 5,54,666కు పెరగ్గా.. ఇప్పటి వరకు 4,57,569 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 2, 215 మంది మృతి చెంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 94,829 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.