అహ్మదాబాద్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం జరగనున్న టీ20 మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించినట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ సిరీస్ మొత్తానికి నరేంద్ర మోదీ స్టేడియంలో 50 శాతం మంది ప్రేక్షలకు అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇప్పటికే స్టేడియం మొత్తాన్నీ సానిటైజ్ చేసినట్లు కూడా అసోసియేషన్ తెలిపింది. మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసుల కారణంగానే 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించిటన్లు జీసీఏ ఒక ప్రకటనలో చెప్పింది. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకూ ఇదే స్టేడియంలో 5 టీ20లు జరగనున్నాయి. ఈ టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్లలో అమ్ముతున్నారు. మ్యాచ్కు వచ్చే వాళ్లంతా కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించేలా స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ తెలిపింది.