హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,63,662కు పెరిగింది. తాజాగా 220 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,54,765 మంది బాధితులు కోలుకున్నారు. మరో ఇద్దరు వైరస్ బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,906కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,991 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ 45,274 టెస్టులు నిర్వహించారు. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 49 కేసులు రికార్డయ్యాయి.