ముంబై, డిసెంబర్ 7: ఐదు సీట్ల సామర్థ్యం కలిగిన టిగువాన్ యూవీ సరికొత్తగా తీర్చిదిద్ది మార్కెట్లోకి మళ్లీ విడుదల చేసింది ఫోక్స్వ్యాగన్. విడుదల సందర్భంగా ఈ కారు ధరను రూ.31.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ మోడల్ కోసం మంగళవారం నుంచి బుకింగ్లు ఆరంభించిన సంస్థ..వచ్చే నెల నుంచి కొనుగోలుదారులకు అందచేయనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రచారం పొందిన ఈ మోడల్ను ఔరంగాబాద్ ప్లాంట్లో తయారు చేయడం విశేషం. 2021లో నాలుగు ఎస్యూవీలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది.