న్యూఢిల్లీ : ఇటాలియన్ మోటార్సైకిల్ బ్రాండ్ భారత్లో డుకాటి 2021 మాన్స్టర్ బుకింగ్స్ను సోమవారం ప్రారంభించింది. రూ లక్ష టోకెన్ అడ్వాన్స్తో ఈ బైక్ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. న్యూ మాన్స్టర్ ధరను ఈనెల 23న వెల్లడించనున్నట్టు కంపెనీ పేర్కొంది.
గత మోడల్కు భిన్నంగా న్యూ మాన్స్టర్ అన్ని విభాగాల్లో నవ్యతతో కస్టమర్ల ముందుకు రానుందని తెలిపింది. 2021 డుకాటి మాన్స్టర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో డైమండ్ ఆకారంలో ఎల్ఈడీ హెడ్లైట్ కలిగిఉంది. మాస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్టెపప్ సీట్, ట్విన్ బ్యారెల్ అప్స్వెఫ్ట్ ఎగ్జాస్ట్తో ముందుకురానుంది.
ఇక న్యూ మాన్స్టర్ 937 సీసీ టెస్టాస్ట్రెటా ఎల్-ట్విన్ ఇంజన్తో పాటు అత్యాధునిక ఫీచర్లతో న్యూ మాన్స్టర్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. డుకాటి మాన్స్టర్ 4.3 ఇంచ్ టీఎఫ్టీ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్, వీలీ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, డుకాటి ట్రాక్షన్ కంట్రోల్, పవర్ లాంఛ్తో రానున్న ఈ బైక్ అర్బన్, టూరింగ్, స్పోర్ట్ రైడింగ్ మోడ్స్లో అందుబాటులో ఉంటుంది.