హైదరాబాద్ : ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. సుమారు 200 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. దొంగతనం విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు.
షోరూమ్లోకి ప్రవేశించే ముందు బయట ఉన్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. లోపల కూడా సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి రూ. లక్షల విలువ చేసే ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ చేశారు. షోరూమ్ యజమానుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిబ్బంది వద్ద పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.