హైదరాబాద్, అక్టోబర్ 25 ( నమస్తే తెలంగాణ): హైటెక్స్లోని టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశ ప్రాంగణం గులాబీ వర్ణంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో నలుమూలల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులు గులాబీ చీర, పురుషులు గులాబీ అంగీలతో హాజరయ్యారు. ప్రతినిధులంతా గులాబీ దుస్తుల్లో రావడంతో హైటెక్స్ ప్రాంగణమంతా జిగేల్మన్నది.