ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. 20 ఏండ్ల యువతిపై గుర్తుతెలియని దుండగులు లైంగిక దాడి చేసి ఆపై హత్య చేశారు. కుర్లాలోని హెచ్డీఐఎల్ కాలనీలో ఖాళీగా ఉన్న భవనం టెర్రస్పై లిఫ్ట్ రూంలో కుళ్లిపోయిన స్ధితిలో యువతి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
యువతి తలపైనా బలమైన గాయాలున్నాయని, ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కొందరు యువకులు గురువారం సాయంత్రం వీడియో షూట్ కోసం ఖాళీ భవనంలోకి వెళ్లారని అక్కడ వారికి యువతి మృతదేహం కనిపించగా పోలీసులకు సమాచారం అందించారని డీసీపీ ప్రణయ్ అశోక్ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నామని, బాధిత యువతిని ఇంకా గుర్తించలేదని తెలిపారు.