బెంగళూరు: విషాహారంతో 20 కోతులను చంపేశారు. ఈ దారుణం కర్ణాటకలో జరిగింది. 20కిపైగా కోతులను చంపి గోనె సంచుల్లో కుక్కి కోలార్ హైవే సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. గుర్తించిన కొందరు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో సిబ్బంది వచ్చి మరణించిన కోతులు ఉన్న గోనె సంచులను స్వాధీనం చేసుకున్నారు. విషమిచ్చి వాటిని చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కోతుల మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని కోలార్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సెల్వమణి తెలిపారు.